తిరుమలలో పెరిగిన రద్దీ!

  • వారాంతం కావడంతో రద్దీ
  • నిన్న దాదాపు 47 వేల మందికి దర్శనం
  • కొండపై వేచి చూస్తున్న 25 వేల మంది
వారాంతంలో తిరుమల రద్దీ గణనీయంగా పెరిగింది. గతంలో ఆన్ లైన్ లో కల్యాణోత్సవం చేయించుకున్న భక్తులు, నిన్న స్వామి దర్శనానికి తరలివచ్చారు. దీంతో దాదాపు 47 వేల మందికి పైగా స్వామిని దర్శించుకున్నారని, భక్తులంతా కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

కల్యాణోత్సవం చేయించుకున్న భక్తులు, తదుపరి నెల రోజుల వ్యవధిలో ఎప్పుడైనా స్వామి దర్శనానికి వెళ్లవచ్చన్న సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాడు హుండీ ఆదాయం సుమారు రూ. 2 కోట్ల 34 లక్షలుగా ఉందని, రథ సప్తమి పర్వదినానికి ఏర్పాట్లు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం తిరుమలలో ఉన్నారని అంచనా.



Tirumala
Tirupati
Piligrims
Rush

More Telugu News